ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,895 పాజిటివ్ కేసులు, 93 మరణాలు సంభవించాయి.

ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.!

Updated on: Aug 23, 2020 | 5:51 PM

Coronavirus Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,895 పాజిటివ్ కేసులు, 93 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,53,111కి చేరింది. ఇందులో 89,742 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,60,087 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,282కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.  అటు గడిచిన 24 గంటల్లో 7,449 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 32,38, 038 టెస్టులు నిర్వహించారు.

Also Read:

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!

Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!

సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..