కరోనా ఎఫెక్ట్.. ఫ్యామిలీకి దూరంగా అజిత్.?

Coronavirus Effect: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ప్రజా రవాణా అంతా బంద్ కాగా.. జనజీవనం మొత్తం స్తంబించిపోయింది. అటు సినీ నటులు కూడా తమ షూటింగ్స్ ను ఆపేసి ఇళ్లకు చేరుకున్నారు. అయితే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ సడన్ లాక్ డౌన్ కు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో లాక్ డౌన్ […]

కరోనా ఎఫెక్ట్.. ఫ్యామిలీకి దూరంగా అజిత్.?

Updated on: Mar 28, 2020 | 2:22 PM

Coronavirus Effect: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ప్రజా రవాణా అంతా బంద్ కాగా.. జనజీవనం మొత్తం స్తంబించిపోయింది. అటు సినీ నటులు కూడా తమ షూటింగ్స్ ను ఆపేసి ఇళ్లకు చేరుకున్నారు. అయితే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ సడన్ లాక్ డౌన్ కు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో లాక్ డౌన్ ప్రకటించినప్పుడు అజిత్ ‘వాలిమై’ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నారు. ఇక కరోనా వైరస్ కట్టడికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ప్రకటించడంతో.. ఆయన హైదరాబాద్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిందని తమిళ మీడియాలో ఓ కథనం ప్రచారమవుతోంది. ఈ సమయంలో ఫ్యామిలీకి దూరంగా గడపాలంటే కష్టమనే చెప్పాలి.

మరోవైపు లోకనాయకుడు కమల్ హసన్ కూడా చెన్నైలోని తన నివాసంలో ఒంటరిగా క్వారంటైన్‌లో ఉన్నారు. హీరోయిన్ శృతి హసన్, అక్షర హసన్ లు ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది.

For More News:

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

హైదరాబాద్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. రాబోయే మూడు రోజుల్లో వర్షాలు..

డేంజర్ బెల్స్: అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసులు.. 1600పైగా మరణాలు

గుడ్ న్యూస్.. కరోనాను జయించిన 101 ఏళ్ల వృద్దుడు..

కరోనా వైరస్ ‘వాట్సప్ గ్రూప్’.. వర్మ పోస్ట్ వైరల్..

దేశంలో 900కు చేరుకున్న కరోనా కేసులు.. కేరళ, మహారాష్ట్రల్లోనే అత్యధికం..

Breaking: కేరళలో తొలి మరణం.. దేశవ్యాప్తంగా 20కి చేరిన మృతుల సంఖ్య..

టెన్త్ పరీక్షలు లేకుండానే నేరుగా ఇంటర్‌లోకి..?

Loading...
Unable to load recommendations.
Follow Us