#CoronaAP: ఏపీలో కొత్తగా 1,085 పాజిటివ్ కేసులు, 8 మరణాలు.. 1,447 మంది రికవరీ..

|

Nov 24, 2020 | 8:08 PM

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,085 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,63,843కి చేరింది.

#CoronaAP: ఏపీలో కొత్తగా 1,085 పాజిటివ్ కేసులు, 8 మరణాలు.. 1,447 మంది రికవరీ..
Follow us on

Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,085 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,63,843కి చేరింది. ఇందులో 13,024 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,43,863 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 8 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,956కు చేరుకుంది. ఇక నిన్న 1,447 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 97.27 సాంపిల్స్‌ను పరీక్షించారు….

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 10, చిత్తూరు 142, తూర్పుగోదావరి 116, గుంటూరు 126, కడప 57, కృష్ణా 224, కర్నూలు 31, నెల్లూరు 50, ప్రకాశం 42, శ్రీకాకుళం 26, విశాఖపట్నం 86, విజయనగరం 37, పశ్చిమ గోదావరి 138 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,21,844కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 823 మంది కరోనాతో మరణించారు.