నాకు నెగటివ్ రిపోర్ట్ వచ్చింది…: రకుల్
ఇటీవల తాను కరోనా టెస్టు చేయించుకోగా నెగటివ్గా నిర్ధారణ అయ్యిందని నటి రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్స్ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి.
సినిమా ప్రపంచాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ వార్తల్లో నానుతున్న పేరు రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల తాను కరోనా టెస్టు చేయించుకోగా నెగటివ్గా నిర్ధారణ అయ్యిందని నటి రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్స్ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి.
తను బాలీవుడ్ సినిమా షూటింగ్లో భాగంగా ఈ నెలలో అర్జున్కపూర్తో కలిసి పనిచేయాల్సి ఉందంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. షూటింగ్ కోసం ముంబయికి రావడానికి ముందు కరోనా టెస్ట్ చేయించుకోగా నెగటివ్ అని తేలిందన్నారు. దీంతో తను ముంబై పయనమయ్యాను.
విమానం ఎక్కిన కొద్ది సమయానికే అర్జున్కి కరోనా పాజిటివ్ అని, షూటింగ్ కొద్దికాలంపాటు నిలిపివేస్తున్నామని చిత్రబృందం పోస్ట్ చేసింది. ఒకవేళ ఇదే విషయం ఒక అరగంట ముందు తెలిసి ఉంటే నేను ముంబైకి వచ్చేదాన్ని కాదు అంటూ పేర్కొంది. బాలీవుడ్ సినిమా షూటింగ్ క్యాన్సిల్ కావడంతో హైదరాబాద్ వెళ్లి నా తదుపరి తెలుగు సినిమా షూటింగ్లో పాల్గొంటాను. అర్జున్కపూర్తో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నాను. తను ఇప్పుడు కోలుకుంటున్నారు అంటూ తన పోస్ట్లో రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు.
సినిమా షూటింగ్స్ మొదలైనా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా చిత్రీకరణల్లో పాల్గొంటున్నారు నటీనటులు. నటి రకుల్ప్రీత్ సింగ్ సైతం తన తదుపరి బాలీవుడ్ సినిమా షూటింగ్లో భాగంగా అర్జున్కపూర్తో కలిసి నటించేందుకు ముంబైకి చేరుకున్నారు. కానీ అర్జున్కపూర్ కొవిడ్ బారినపడడంతో సదరు చిత్రబృందం షూటింగ్ను ప్రస్తుతానికి నిలిపివేసింది.