
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయం మాత్రమే చేయడం వచ్చని అందరూ అనుకుంటారు. కానీ ఆయనలోని కొత్త కోణం ఎవరికి తెలియదు. తాజాగా ఆయనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఇటీవల ఆయన చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి అందరూ కూడా రాహుల్ గాంధీలో ఈ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అసలు రాహుల్ ఏమి చేశారో మనం కూడా చూద్దాం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ పర్యటించారు. ప్రచారం ముగించుకుని.. తిరిగి వెళ్లాల్సిన తరుణంలో ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది, హెలికాప్టర్ సిబ్బంది ఎంత ప్రయతించినా ఫలితం దక్కలేదు. దీంతో స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగాడు. నేలపై పడుకొని హెలికాప్టర్ డోర్స్ స్క్రూలు బిగించారు. ఇక అందుకు సంబంధించిన ఫోటోను రాహుల్ గాంధీ తన ఇన్స్టగ్రామ్లో పోస్ట్ చేస్తూ ‘అందరం కలిసి చేసిన తర్వాత ప్లాబ్లమ్ సాల్వ్ అయిపోయింది’ అని రాశారు. ఈ పోస్టుపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు సెటైర్స్ వేస్తున్నారు.