AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిఎ విషయంలో విధానం మార్చాలి: సిఎం

ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల డిఎ విషయంలో కేంద్ర విధానం మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. “ప్రస్తుతం డిఎ ఎంత అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది. దాన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కేంద్రం అంచనాలు తయారు చేసి, నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం జరుగుతున్నది. ప్రస్తుతం మూడు డిఏలు చెల్లించాల్సి ఉంది. ఇందులో రెండు డిఎల విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కేంద్రం తీసుకునే నిర్ణయంలో జాప్యం వల్ల రాష్ట్రాలు జాప్యం చేయాల్సి […]

డిఎ విషయంలో విధానం మార్చాలి: సిఎం
Venkata Narayana
|

Updated on: Oct 23, 2020 | 7:33 PM

Share

ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల డిఎ విషయంలో కేంద్ర విధానం మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. “ప్రస్తుతం డిఎ ఎంత అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది. దాన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కేంద్రం అంచనాలు తయారు చేసి, నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం జరుగుతున్నది. ప్రస్తుతం మూడు డిఏలు చెల్లించాల్సి ఉంది. ఇందులో రెండు డిఎల విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కేంద్రం తీసుకునే నిర్ణయంలో జాప్యం వల్ల రాష్ట్రాలు జాప్యం చేయాల్సి వస్తున్నది. ఫలితంగా బకాయిలు పేరుకుపోతున్నాయి. ఉద్యోగులకు సకాలంలో డిఎ అందడం లేదు. ఈ పరిస్థితి మారాలి. ప్రతీ ఆరు నెలలకు ఒక సారి గడువు తేదీ రాగానే రాష్ట్రంలో చెల్లించాల్సిన డిఏ నిర్ణయించాలి. కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే దాన్ని సవరించాలి. ఉదాహరణకు రాష్ట్రం 3 శాతం డిఎ ప్రకటించి అమలు చేయాలి. కేంద్రం 3.5 శాతం అని ప్రకటిస్తే మిగిలిన 0.5 శాతం చెల్లించాలి. 2.5 గా నిర్ణయిస్తే 0.5 శాతం తగ్గించి చెల్లించాలి. ఈ విషయంలో వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలి. కేబినెట్లో చర్చించి విధాన నిర్ణయం తీసుకుంటాం” అని సిఎం వెల్లడించారు.