రేపు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌.. వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్ల చ‌ర్చ‌

|

Dec 18, 2020 | 11:24 AM

వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్నత స్థాయి...

రేపు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌.. వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్ల చ‌ర్చ‌
Follow us on

వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన‌నున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదు.

కాపీ అందిన తర్వాత దానిపై కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టు కు వెళ్లడమా ? లేదంటే త‌గిన విధంగా విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా ? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు సీఎం కేసీఆర్‌.

ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్ నిలిపివేయండి..వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు