AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పారిశుధ్య కార్మికుల సమ్మెతో కంపు కొడుతున్న తాజ్ మహల్

ప్రపంచానికి అందంగా కనిపించే తాజ్ మహల్ మరోసారి వార్తలకెక్కెంది. తాజ్ మహల్ ప్రస్తుతం చెత్త,చెదారంతో నిండిపోయింది. ఎక్కడిక్కడే కంపు కొడుతోంది. ఇక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఒక్కసారిగా సమ్మెకు దిగడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. తాజ్ పరిసరాలు అపరిశుభ్రంగా లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. అయితే తమకు రావాల్సిన జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికులంతా మూకుమ్మడిగా సమ్మెకు దిగారు. దీంతో తాజ్ మహల్ పరిసరాలు చెత్తతో దర్శనమిస్తున్నాయి, టాయిలెట్లు దుర్గంధాన్ని  వెలుజల్లుతున్నాయి. మొత్తం 28 మంది పారిశుధ్య […]

పారిశుధ్య కార్మికుల సమ్మెతో  కంపు కొడుతున్న తాజ్ మహల్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2019 | 10:04 PM

Share

ప్రపంచానికి అందంగా కనిపించే తాజ్ మహల్ మరోసారి వార్తలకెక్కెంది. తాజ్ మహల్ ప్రస్తుతం చెత్త,చెదారంతో నిండిపోయింది. ఎక్కడిక్కడే కంపు కొడుతోంది. ఇక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఒక్కసారిగా సమ్మెకు దిగడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. తాజ్ పరిసరాలు అపరిశుభ్రంగా లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. అయితే తమకు రావాల్సిన జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికులంతా మూకుమ్మడిగా సమ్మెకు దిగారు. దీంతో తాజ్ మహల్ పరిసరాలు చెత్తతో దర్శనమిస్తున్నాయి, టాయిలెట్లు దుర్గంధాన్ని  వెలుజల్లుతున్నాయి.

మొత్తం 28 మంది పారిశుధ్య కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే జీతాల ఇవ్వని కారణంగా ఓ కార్మికుని భార్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో ఆగ్రహించిన వీరంతా మూకుమ్మడిగా సమ్మెకు దిగారు. తమ జీతాలు వెంటే ఇవ్వాలని పట్టుబట్టారు.

ఓ ప్రైవేటు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న వీరికి గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. బుధవారం, గురువారం కార్మికులు సమ్మెకు దిగగా శుక్రవారం తాజ్‌కు సెలవు. అయితే శనివారం కార్మికులు యధావిధిగా తమ పనులకు వస్తారని భావిస్తున్నట్టు తాజ్‌ను పర్యవేక్షిస్తున్న ఆర్కియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నారు.