దేశం ఓ వజ్రాన్ని కోల్పోయింది…

|

Aug 31, 2020 | 11:30 PM

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంపై సామాన్యుల నుంచి సెలెబ్రిటిల వరకు దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆయన మరణంతో దేశం విషాదంలో మునిగిపోయింది. ప్రణబ్‌ మృతి పట్ల ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రణబ్‌ మరణంతో తీవ్ర...

దేశం ఓ వజ్రాన్ని కోల్పోయింది...
Follow us on

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంపై సామాన్యుల నుంచి సెలెబ్రిటిల వరకు దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆయన మరణంతో దేశం విషాదంలో మునిగిపోయింది. ప్రణబ్‌ మృతి పట్ల ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రణబ్‌ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా   స్పందించారు. అతనితో నేను గడిపిన క్షణాలను ఎప్పటికి గుర్తుంటాయి. ఒక గొప్ప జ్ఞానం, విశిష్టమైన రాజకీయ జీవితాన్ని సాధించిన వ్యక్తి మీరు. మిమ్మల్ని మిస్ అవుతాము సర్.. దేశం ఈ రోజు ఒక విలువైన వజ్రాన్ని కోల్పోయింది అంటూ ట్వీట్ చేశారు.

‘ప్రణబ్ ముఖర్జీ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. అతనితో నేను గడిపిన క్షణాలను ఎప్పటికి గుర్తుంటాయి. ఒక గొప్ప జ్ఞానం, విశిష్టమైన రాజకీయ జీవితాన్ని సాధించిన వ్యక్తి మీరు. మిమ్మల్ని మిస్ అవుతాము సర్.. దేశం ఈ రోజు ఒక విలువైన వజ్రాన్ని కోల్పోయింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రణబ్‌ దా..’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.