గాల్వన్ లో చొరబాటుకు చైనా ముందే వ్యూహం

లడాఖ్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో గత జూన్ నెలలో భారత-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణ కాకతాళీయం, కాదని, చైనా ముందుగానే ప్లాన్ చేసుకున్నదని తెలిసింది. ఈ లోయలోని..

గాల్వన్ లో చొరబాటుకు చైనా ముందే వ్యూహం

Edited By:

Updated on: Aug 11, 2020 | 6:26 PM

లడాఖ్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో గత జూన్ నెలలో భారత-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణ కాకతాళీయం, కాదని, చైనా ముందుగానే ప్లాన్ చేసుకున్నదని తెలిసింది. ఈ లోయలోని ఫింగర్ 4 నుంచి హాట్ స్ప్రింగ్ ప్రాంతం వరకు చొరబడడానికి డ్రాగన్ కంట్రీ సమగ్ర సన్నాహాలు చేసుకున్నట్టు యూఎస్ ఇంటెలిజెన్స్ సంస్థలు, భారత భద్రతా ఏజెన్సీలు తమ వేర్వేరు నివేదికల్లో తెలిపాయి. కొన్ని చోట్ల చైనా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలను, టీ-15 ట్యాంకులను టిబెట్ వద్ద మోహరించింది.

తేలికపాటి గన్స్ తో కూడిన ఈ ట్యాంకులను సులభంగా ఎత్తయిన కొండ ప్రదేశాలకు హెలికాఫ్టర్ల ద్వారా కూడా తరలించవచ్చునట. గత జనవరిలోనే చైనా టిబెట్ లో వీటిని సర్వ సన్నద్ధంగా ఉంచినట్టు వెల్లడైంది. అయితే ఇండియా వీటికన్నా శక్తిమంతమైన ట్యాంకులను, ఇతర ఆయుధాలను మోహరించి ఉంచింది.

Loading...
Unable to load recommendations.
Follow Us