తిరుమల శ్రీవారి దర్శించుకోనున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

|

Nov 18, 2020 | 12:01 AM

 శ్రీవారి సేవలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తిరుమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు. అతిధి గృహం వద్ద చేరుకున్న..

తిరుమల శ్రీవారి దర్శించుకోనున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
Follow us on

శ్రీవారి సేవలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తిరుమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు. అతిధి గృహం వద్ద చేరుకున్న చౌహాన్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం  అధికారులు స్వాగతం పలికారు.

ఈ రాత్రికి సీఎం శివరాజ్‌సింగ్ తిరుమలలోనే బస చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతకుముందు శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలంగాణలోని ముచ్చింతల్‌కు వెళ్లారు. అక్కడ చిన్న జీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకుని తిరుమల పర్యటనకు బయల్దేరారు.