AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు

ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్న్స్ గడువును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు
Ravi Kiran
|

Updated on: Jul 30, 2020 | 1:51 PM

Share

Income Tax Return Filing Deadline Till September 30: ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్న్స్ గడువును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30 వరకు చెల్లించవచ్చునని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

పన్ను చెల్లింపుదారులకు ఇది మరింత సౌలభ్యాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు. గతంలో ఐటీ రిటర్న్స్ చెల్లింపు చివరి తేదీ జూలై 31 వరకు ఉండగా.. ఇప్పుడు అది కాస్తా రెండు నెలలకు పొడిగించారు. కాగా, 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్ చెల్లింపు గడువును ఆదాయపన్ను శాఖ పొడిగించడం ఇది మూడోసారి. ఇదివరకు మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడిగించగా.. ఆ తర్వాత జూలై 31 వరకు.. ఇప్పుడు సెప్టెంబర్‌కు పొడిగించింది.

Also Read: