హైదరాబాద్లో కరోనా పరీక్షలు చేసేది ఇక్కడే.!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా పరీక్షలు నిర్వహించే కేంద్రాల అధికారిక లిస్టును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది.
Corona Testing Centres In Hyderabad: కరోనా వస్తే ఏం చేయాలి.? ఎక్కడికి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలి.? అనే విషయాలు ఇప్పటికీ పలువురికి తెలియదు. ఈ నేపధ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా పరీక్షలు నిర్వహించే కేంద్రాల అధికారిక లిస్టును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గ్రేటర్ పరిధిలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఆరోగ్య కేంద్రాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో కరోనా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అన్ని చోట్లా విస్తృతంగా చేస్తున్న ఆర్టీ-పీసీఆర్ పరీక్షలతో పాటు ర్యాపిడ్ యాంటిజన్ టెస్టులను కూడా నిర్వహిస్తున్నారని.. ప్రజలు కరోనా పరీక్షలను ఇక్కడ నుంచే చేయించుకోవాలని సూచించింది. ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు:
ప్రభుత్వ ఆసుపత్రులు, పరిశోధన సంస్థలు ఇవే.. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రి, నిమ్స్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ, సీసీఎంబీ (తార్నాక), సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, డయోగ్నోస్టిక్స్, రైల్వే ఆసుపత్రి (లాలాగూడ)
ప్రైవేటు ల్యాబ్లు.. విజయా డయోగ్నోస్టిక్స్, మెడసిస్ పాథ్ల్యాబ్స్, అపోలో ఆసుపత్రి (జూబ్లీహిల్స్), డాక్టర్ రెమిడీస్, సెల్ కరెక్ట్ డయోగ్నోస్టిక్స్, పాథ్కేర్, కిమ్స్, ఏఐజీ ఆసుపత్రి, అపోలో హెల్త్ కేర్ (సికింద్రాబాద్), యశోద (సికింద్రాబాద్), కామినేని (మౌలాలి), అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ, మేగ్సేన్ డయోగ్నోస్టిక్స్, స్టార్ ఆసుపత్రి, గ్లనికల్ గ్లోబల్, కాంటినెంటల్ ఆసుపత్రుల ల్యాబ్లు.
రంగారెడ్డి:
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీల వివరాలు: సరూర్నగర్, బాలాపూర్, అబ్దుల్లాపూర్మెట్, రంగనాయకకుంట, మన్సూరాబాద్, హఫీజ్పేట్, రాయదుర్గం, శేరిలింగంపల్లి, ఆమన్గల్, యాచారం, కొత్తూరు.
మేడ్చల్:
ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు.. మల్కాజిగిరి (ఏరియా ఆసుపత్రి).. పీహెచ్సీలు: మేడ్చల్, అల్వాల్, బాలానగర్, మల్కాజిగిరి, ఉప్పల్, కుషాయిగూడ, జవహర్నగర్, నారపల్లి, దుండిగల్, శామీర్పేట, కీసర
యూపీహెచ్సీలు: మచ్చబొల్లారం, సుభాష్నగర్, పర్వత్నగర్, మూసాపేట, జగద్గిరిగుట్ట, ఎల్లమ్మబండ, హస్మత్పేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, షాపూర్నగర్, గాజులరామారం, సురారం కాలనీ, వినాయకనగర్, ఏకలవ్యనగర్, మౌలాలి, సఫిల్గూడ, మల్లాపూర్, వెంకట్రెడ్డినగర్, నాగోలు, కొత్తపేట్, చర్లపల్లి, పీర్జాదిగూడ, మేడ్చల్, బోడుప్పల్.
బస్తీ దవాఖానాలు: అంబేడ్కర్నగర్ (గాజులరామారం), అంజయ్యనగర్ (బోయినపల్లి), బీజేఆర్నగర్, బాగ్మీరి కమ్యూనిటీ హాల్, బాలాజీనగర్ (మూసాపేట), చాకలి కుమ్మరి బస్తీ (కూకట్పల్లి), ఇందిరాగాంధీపురం, జీడిమెట్ల, కైత్లాపూర్, న్యూశివాలయ (సూరారం), రాజీవ్గాంధీనగర్ (మూసాపేట), వాల్వర్నగర్ (నాచారం), ఎల్లమ్మబండ, జింకల్వాడ (మూసాపేట), అంబేడ్కర్నగర్ (కొత్తబస్తీ), అరుంధతి కమ్యూనిటీ హాల్ (అల్వాల్), మోడల్ మార్కెట్ (తుర్కపల్లి), ద్వారకానగర్ (కుత్బుల్లాపూర్), నందన్నగర్, భగత్సింగ్నగర్ (చింతల్), కేపీహెచ్బీ 5వ ఫేజ్, పాపిరెడ్డినగర్, వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్, ఎర్రకుంట, ఇందిరానగర్ (నాచారం), ఎల్ఎన్కాలనీ, మర్రిగూడ (మల్లారం), పెద్దచర్లపల్లి (కాప్రా), రాజీవ్నగర్ (కాప్రా), ఎస్సీ కమ్యూనిటీహాల్ (చిల్కానగర్), సాయిబాబానగర్ (దమ్మాయిగూడ), వివేక్నగర్ (రామాంతాపూర్), మహిళా మండలి భవన్ (కుషాయిగూడ), సాయిరాం నగర్ కమ్యూనిటీ హాల్ (కుషాయిగూడ), అశోక్నగర్ (కాప్రా), సింగంచెరువు (కాప్రా), స్వామి వివేకానందనగర్ (కాప్రా).
హైదరాబాద్:
ప్రభుత్వ ఆసుపత్రులు: ఆయుర్వేద ఆసుపత్రి, నేచర్క్యూర్, సరోజినీదేవి నేత్ర వైద్యశాల, నిజామియా టిబ్బి ఆసుపత్రి (చార్మినార్), మలక్పేట, నాంపల్లి, గోల్కొండ (ఏరియా ఆసుపత్రులు).
యూపీహెచ్సీలు: బండ్లగూడ, బార్కస్, మైసారం, పార్వతీనగర్, ఉప్పుగూడ, బాలాగంజ్, చందులాల్ బారాదరి, తీగలకుంట, జహనుమా, చార్మినార్, ఉమ్డాబజార్, అలియాబాద్, ఈద్బజార్, ఆమన్నగర్, పంజేషా-1, నయాపూల్, తారామైదాన్, కామాటిపుర, పంజేషా-2, డబీర్పురా, దారూషిఫా, అజంపురా, యూకుత్పురా-1, యాకుత్పురా-2, మలక్పేట, జాంబాగ్ పార్క్, మాదన్నపేట, గడ్డిఅన్నారం, శాలివాహననగర్, బాగ్అంబర్పేట్, ముషీరాబాద్, భోలక్పూర్, ఎఎంఎస్, హర్రాజ్పెంట, తిలక్నగర్, పురానాపుల్-1, పురానాపుల్-2, చింతల్బస్తీ, ఖైరతాబాద్, కుమ్మర్వాడి, ఫిల్మ్నగర్, గుడిమల్కాపూర్, కార్వాన్-1, గోల్కొండ, బొల్లారం, రసూల్పుర మొదలగునవి.
రూల్స్ ఇలా ఉన్నాయి:
ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు, యూపీహెచ్సీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా పరీక్షలు చేస్తారు. ప్రైవేట్ ల్యాబ్లలో అయితే ఒక్కో ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు రూ. 2,300 చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కేంద్రాల్లో టోకెన్ల పద్దతి కూడా ఉంది. పరీక్షా కేంద్రాల వద్ద టెస్ట్ చేయించుకున్న వ్యక్తి చిరునామా, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి. పరీక్ష చేయించుకున్న రోజు సాయంత్రం లేదా తర్వాత రోజు ఉదయానికి ఫలితాలు ఎస్ఎంఎస్ రూపంలో సంబంధిత వ్యక్తి మొబైల్ నెంబర్కు వస్తాయి.
Also Read:
కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..