AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రెజిల్‌లో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 45 వేలకు పైగా..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో బ్రెజిల్ లో గడిచిన 24 గంటల్లో 45,305 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతకుముందు రోజు నమోదైన

బ్రెజిల్‌లో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 45 వేలకు పైగా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 08, 2020 | 9:34 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో బ్రెజిల్ లో గడిచిన 24 గంటల్లో 45,305 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతకుముందు రోజు నమోదైన కేసుల కంటే రెట్టింపు కేసులు నమోదు కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 16,68,589కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,254 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 66,741కు చేరింది.

ఈ మహమ్మారి బారిన పడిన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, ఇండియా, రష్యా, పెరు దేశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 20 నుంచి 30 శాతం కేసులు ఒక్క అమెరికాలోనే నమోదు కావడం గమనార్హం. బ్రెజిల్ లో ఇప్పటివరకు 9,76,977 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.