కిడ్నాప్ చేసిన రెండు గంటలకే దీక్షిత్ ను చంపేశారంటోన్న పోలీసులు!

|

Oct 22, 2020 | 11:03 AM

కిడ్నాప్ చేసిన రెండు గంటలకే బాలుడు దీక్షిత్‌ను చంపేశారని పోలీసులు చెబుతున్నారు. ‘చంపిన తర్వాత డబ్బులు డిమాండ్ చేసారు. యాప్ కాల్ ద్వారా ఇంటర్నెట్ కాల్స్ చేసారు. మొత్తం నలుగురు ఇన్వాల్వ్ అయ్యారు.’ అని టీవీ9 తో వరంగల్ ఐజీ నాగిరెడ్డి చెప్పారు. కిడ్నాపర్లు దీక్షిత్ ను అత్యంత కిరాతకంగా చంపారని ఐజీ వెల్లడించారు. ఇలా ఉండగా, మహబూబాబాద్ జిల్లా (పాత వరంగల్ జిల్లా)‌ మహబూబాబాద్ పట్టణానికి చెందిన తొమ్మిదేళ్ల కుసుమ దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది. […]

కిడ్నాప్ చేసిన రెండు గంటలకే దీక్షిత్ ను చంపేశారంటోన్న పోలీసులు!
Follow us on

కిడ్నాప్ చేసిన రెండు గంటలకే బాలుడు దీక్షిత్‌ను చంపేశారని పోలీసులు చెబుతున్నారు. ‘చంపిన తర్వాత డబ్బులు డిమాండ్ చేసారు. యాప్ కాల్ ద్వారా ఇంటర్నెట్ కాల్స్ చేసారు. మొత్తం నలుగురు ఇన్వాల్వ్ అయ్యారు.’ అని టీవీ9 తో వరంగల్ ఐజీ నాగిరెడ్డి చెప్పారు. కిడ్నాపర్లు దీక్షిత్ ను అత్యంత కిరాతకంగా చంపారని ఐజీ వెల్లడించారు.

ఇలా ఉండగా, మహబూబాబాద్ జిల్లా (పాత వరంగల్ జిల్లా)‌ మహబూబాబాద్ పట్టణానికి చెందిన తొమ్మిదేళ్ల కుసుమ దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది. కేసముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృత దేహాన్ని ఈ ఉదయం పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలుడి బంధువులు మనోజ్‌ రెడ్డి, సాగర్‌పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలుడు దీక్షిత్‌ విడుదలకు రూ.45 లక్షలను డిమాండ్ చేసిన కిడ్నాపర్లు చివరికి అన్నెంపుణ్యం తెలీని చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన మరింత వీడియో సమాచారం దిగువున..