AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం : చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. క్రీమ్ బిస్కెట్లు తిన్న ముగ్గురు చిన్నారుల్లో ఒకరు ప్రాణాలు విడవగా, మరో ఇద్దరు అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

విషాదం : చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్
Ram Naramaneni
|

Updated on: Sep 14, 2020 | 12:33 PM

Share

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. క్రీమ్ బిస్కెట్లు తిన్న ముగ్గురు చిన్నారుల్లో ఒకరు ప్రాణాలు విడవగా, మరో ఇద్దరు అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే..హుసెన్ బాషా, దిల్ షాద్ దంపతులకు హుసేన్ బాషా(6), హుసేన్ బీ(4) ఇద్దరు సంతానం. ఇరువురు చిన్నారులు బాబాయి కూతురు బషిరున్(8)తో కలిసి గ్రామంలోని ఓ కిరాణా కొట్టుకు వెళ్లి బిస్కెట్ ప్యాకెట్ కొనగోలు చేసి, ఇంటి వద్దకు వచ్చాక తిన్నారు. అవి తిన్న వెంటనే ముగ్గురు చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే వారిని ఆళ్లగడ్డ గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే హుసేన్ బాషా మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరు చిన్నారును మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు.

Also Read :

అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కరోనా పాజిటివ్

ఏపీలో కుండపోత వర్షం, ఈ జిల్లాలకు అలర్ట్