AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కామారెడ్డి జిల్లాలో దారుణం.. అంథుడి దారుణ హత్య

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కళ్లు కనిపించని ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు కసాయి దుండగులు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కామారెడ్డి జిల్లాలో దారుణం.. అంథుడి దారుణ హత్య
Balaraju Goud
|

Updated on: Jul 14, 2020 | 9:58 PM

Share

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కళ్లు కనిపించని ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు కసాయి దుండగులు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సదాశివనగర్ శివారులో జాతీయ రహదారి కల్వర్టు కింద ఓ అంధుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అటు వెళ్తున్న వాహనదారులు గుర్తు తెలియని శవం పడి ఉన్న విషయం పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సదాశివనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. మృతుడు నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కామారెడ్డి కి ఎలా వచ్చాడు. ఎందు వచ్చాడో అంతుచిక్కకుండా ఉందని పోలీసులు తెలిపారు.