పార్లమెంట్ లో డ్రగ్స్ ప్రస్తావన, లేవనెత్తిన బీజేపీ ఎంపీ రవి కిషన్
డ్రగ్స్ ముఠాలతో బాలీవుడ్ లింక్ పై పార్లమెంట్ ఒక్కసారిగా 'ఉలిక్కిపడింది'. సమావేశాల తొలి రోజునే లోక్ సభలో ఈ అంశాన్ని బీజేపీ ఎంపీ, భోజ్ పురి నటుడు రవి కిషన్ ప్రస్తావిస్తూ, దేశంలో డ్రగ్స్ అక్రమ రవాణా..
డ్రగ్స్ ముఠాలతో బాలీవుడ్ లింక్ పై పార్లమెంట్ ఒక్కసారిగా ‘ఉలిక్కిపడింది’. సమావేశాల తొలి రోజునే లోక్ సభలో ఈ అంశాన్ని బీజేపీ ఎంపీ, భోజ్ పురి నటుడు రవి కిషన్ ప్రస్తావిస్తూ, దేశంలో డ్రగ్స్ అక్రమ రవాణా, అడిక్షన్ పెరిగిపోయాయన్నారు. మన దేశ యువత భవిష్యత్తును నాశనం చేసేందుకు పొరుగునున్న చైనా, పాకిస్తాన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. నేపాల్, పంజాబ్ ద్వారా రహస్యంగా మత్తుమందులు దేశంలోకి చేరుతున్నాయన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ బెడదను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవడం హర్షణీయమని, కేంద్రం కూడా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపి, డ్రగ్స్ సప్లయ్ దారులను, ఇందుకు మూలకారకులైనవారిని అరెస్టు చేయాలని రవి కిషన్ కోరారు.
Drug addiction is in film industry too. Several people have been apprehended, NCB is doing very good work. I urge central govt to take strict action, apprehend the culprits soon, give them befitting punishment & bring an end to conspiracy of neighbouring countries: Ravi Kishan https://t.co/5oUiQLxiHu
— ANI (@ANI) September 14, 2020