మంత్రి అయిన మూడు రోజులకే రాజీనామా.. బీహార్‌ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరి నిర్ణయం.. కారణం అదేనా..?

బీహార్‌లో ఓ మంత్రికి తన పదవి మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అవినీతి ఆరోపణలు కావడంతో మూడు రోజులకే రాజీనామా చేశాడు.

మంత్రి అయిన మూడు రోజులకే రాజీనామా.. బీహార్‌ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరి నిర్ణయం.. కారణం అదేనా..?
Follow us

|

Updated on: Nov 19, 2020 | 5:52 PM

బీహార్‌లో ఓ మంత్రికి తన పదవి మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అవినీతి ఆరోపణలు కావడంతో మూడు రోజులకే రాజీనామా చేశాడు. బీహార్‌ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరి తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, మూడు రోజుల కిందట బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో పాటు 14 మంది మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఇందులో భాగంగా తారాపూర్‌ నియోజకవర్గం నుంచి జేడీయూ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన మేవాలాల్‌ చౌదరికి విద్యా శాఖను కట్టబెట్టారు నితీష్. గతంలో ఆయన భాగల్‌పూర్‌ వ్యవసాయ వర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా పని చేశారు. ఈ నేపథ్యంలో విద్యావంతుడైన మేవాలాల్ విద్యాశాఖ మంత్రి ప్రమాణం స్వీకారం చేశారు.

వ్యవసాయ వర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా పనిచేస్తున్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. వర్సిటీ పరిధిలో నిర్మించిన పలు భవనాల విషయంలో అవకతవకలకు పాల్పడ్డట్లు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టాయి. అంతేకాదు, లంచం తీసుకుని అర్హతలేని వారికి యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, జూనియర్‌ శాస్త్రవేత్తలుగా నియమించారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేవాలాల్‌కు మంత్రి పదవి కట్టబెట్టడం పట్ల ఆర్జీడీతో సహా అన్ని పార్టీల నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. తన పదవిని కాపాడుకునేందుకు నితీశ్‌ అవినీతిపరులకు కేబినెట్‌లో చోటు కల్పించారంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఏద్దేవా చేశారు.

ఇదిలావుంటే, ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మేవాలాల్‌ చౌదరి జాతీయ గీతం తప్పుగా ఆలపించడం, అది కాస్త వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ప్రతిపక్షాలకు మరో ఆయుధం దొరికినట్లైంది. “పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా” కు బదులుగా “పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా” అని పాడటంతో ప్రతిపక్షాలు సహా నెటిజన్లు ఆయనపై సెటైర్ల వర్షం గుప్పిస్తున్నారు. అవినీతి కేసుల మంత్రికి జాతీయ గీతం కూడా ఆలపించడం రాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో మేవాలాల్‌ చౌదరి తన పదవి రాజీనామా చేయడం గమనార్హం. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కి అందజేశారు. కాగా, సాధారణ ఎమ్మల్యేగా ప్రజలకు సేవనంటూ మేవాలాల్ పేర్కొన్నారు.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..