ఆ ఇద్దరిని ఆస్ట్రేలియాకు పంపిస్తాం…

|

Nov 03, 2020 | 6:40 PM

బీసీసీఐ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. ఆ ఇద్దరు కోలుకుంటే ఆస్ట్రేలియా టూర్‌కు పంపిస్తామని తెలిపింది. ఇందులో ఒకరు తొడకండరాల గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కాగా… ఇషాంత్ శర్మ మరొకరు. అయితే స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఆసీస్‌ టూర్‌కు బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. రోహిత్‌ గాయం తీవ్రతపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం, బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై విమర్శలు గుప్పుమన్నాయి. ఐపీఎల్‌లోనే గాయపడ్డ […]

ఆ ఇద్దరిని ఆస్ట్రేలియాకు పంపిస్తాం...
Follow us on

బీసీసీఐ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. ఆ ఇద్దరు కోలుకుంటే ఆస్ట్రేలియా టూర్‌కు పంపిస్తామని తెలిపింది. ఇందులో ఒకరు తొడకండరాల గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కాగా… ఇషాంత్ శర్మ మరొకరు.

అయితే స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఆసీస్‌ టూర్‌కు బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. రోహిత్‌ గాయం తీవ్రతపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం, బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై విమర్శలు గుప్పుమన్నాయి.

ఐపీఎల్‌లోనే గాయపడ్డ ఇషాంత్‌ శర్మ, రోహిత్‌ శర్మ పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం సమీక్షిస్తున్నదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వెల్లడించారు. వీరిద్దరిని ఎంపిక చేసేందుకు సెలక్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.