విజయవాడలో మటన్ మాఫియా రెచ్చిపోతోంది…
మీరుబెజవాడ వాసులా? సండే కదా అని మాంసం కొంటున్నారా? అయితే కాస్త ఆగండి..కాస్తా ఈ స్టోరీ చదవిన తరువాత కొనాలా వద్దా అనేది డిసైడ్ అవండి.. మటన్ షాపువాడు ఇచ్చింది తీసుకుంటే..ఆ తర్వాత రోగాలు కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు అధికారులు.
Mutton Shops : మీరుబెజవాడ వాసులా? సండే కదా అని మాంసం కొంటున్నారా? అయితే కాస్త ఆగండి..ఈ స్టోరీ చదవిన తరువాత కొనాలా వద్దా అనేది డిసైడ్ అవండి.. మటన్ షాపువాడు ఇచ్చింది తీసుకుంటే..ఆ తర్వాత రోగాలు కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు అధికారులు.
ఎందుకంటే కుళ్లిన మాంసం విక్రయిస్తున్నారు. కరోనా వ్యాప్తితో నాన్వెజ్ అమ్మకాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. మటన్, చికెన్ ఇలా.. వారంతంలో రుచిచూసేవాళ్లు.. ఇప్పుడు వారానికి మూడు, నాలుగు రోజులు అదేపనిలో ఉంటున్నారు. అయితే, పనిలో పనిగా.. నిల్వచేసిన మాంసాన్ని, కుళ్లిపోయి పురుగులు పడిన మటన్ను కూడా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు.
విజయవాడలో మటన్ మాఫియా రెచ్చిపోతోంది.. వీకెండ్ రష్ని దృష్టిలో పెట్టుకుని చనిపోయిన పొట్టేలు మాంసాన్ని విక్రయిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. ఇది దో నెంబర్ దందాపై సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు తాజాగా దాడులు నిర్వహించారు. చనిపోయిన పొట్టేలు మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
కుళ్లిపోయి పురుగులు పట్టిన 70 కిలోల మేక మాంసాన్ని గుర్తించారు.. చనిపోయిన పొటేల్ మటన్ను విక్రయిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇక, నిల్వ చేసిన మేక తలకాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బార్చీక్యూ నేషన్లో ఆహార నిల్వలు బయటపడడంతో.. ఈ దాడులకు పూనుకున్నారు.
బెజవాడలోని గోళ్లపాలెం గట్టు సెంటర్లో నిల్వ ఉన్న మటన్ విక్రయాలు కొనసాగిస్తున్న విషయాన్ని కార్పోరేషన్ అధికారులు గుర్తించారు. నాన్వెజ్ కొనే సమయంలో జాగ్రత్తగా ఓసారి పరిశీలించడం మంచిదని సూచిస్తున్నారు. చనిపోయిన పొట్టేళ్లను గుర్తించిన అధికారులు.. వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు.. ఏ హోటల్స్ కి సప్లై చేస్తున్నారు అనే కోణంలో విచారిస్తున్నారు.