AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు అలెర్ట్ : పీఎం కిసాన్  స్కీమ్ డబ్బు పడకపోతే ఇలా చేయండి !

రైతుల ఆర్థికంగా చేయూత అందించాలనే లక్ష్యంతో పీఎం కిసాన్  స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 

రైతులకు అలెర్ట్ : పీఎం కిసాన్  స్కీమ్ డబ్బు పడకపోతే ఇలా చేయండి !
Ram Naramaneni
|

Updated on: Oct 05, 2020 | 4:35 PM

Share

రైతుల ఆర్థికంగా చేయూత అందించాలనే లక్ష్యంతో పీఎం కిసాన్  స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  ఈ స్కీమ్‌లో చేరిన రైతులు ఏడాదికి రూ.6,000 సాయం అందుతుంది. ఇది మూడు విడతల్లో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది. కాగా ప్రభుత్వం ఇప్పటికే ఆరు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేసింది. అంటే ఒక్కో రైతు బ్యాంక్ ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.12,000 వచ్చాయి. ఇప్పుడు మోదీ సర్కార్ ఏడో విడత డబ్బులను రైతులకు అందించేందుకు సిద్దమవుతుంది.

అయితే కొంత మంది  అన్నదాతలకు పీఎం కిసాన్  స్కీమ్‌ డబ్బులు అందడం లేదు. అన్ని అర్హతలు ఉండి అర్జీ చేసుకున్నా కూడా డబ్బు మాత్రం జమవ్వడం లేదు. ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రైతులు పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందాలని భావిస్తే.. కచ్చితంగా బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి.

బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ లింక్ అయిన రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందుతాయి. ఇవి లింక్ కాని అన్నదాతలకు మాత్రం రూ.2,000 రావడం లేదు. అందువల్ల మీరు కూడా వెంటనే బ్యాంక్‌కు వెళ్లి ఆధార్‌ను లింక్ చేసుకోండి. అయితే రైతులు ఇక్కడ ఒక విషయాన్ని గుమనించాలి. బ్యాంక్ అకౌంట్‌లో వివరాలు, ఆధార్ కార్డులో వివరాలు రెండూ సరితూగాలి. లేదంటే ఇవి లింక్ కాకపోవచ్చు. మీరు బ్యాంక్ బ్రాంచుకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ( ఏపీ మందుబాబులకు భారీ షాక్ !)