అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్

|

Dec 11, 2020 | 3:38 PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై నేపథ్యంలో బెంగల్​ సీఎం మమతా బెనర్జీపై  ఆ రాష్ట్ర గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు​.

అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్
Follow us on

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై నేపథ్యంలో బెంగల్​ సీఎం మమతా బెనర్జీపై  ఆ రాష్ట్ర గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు​. ఘటనపై మమత చేసిన కామెంట్లకు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు. మమతా అగ్నితో ఆటలాడకూడదని ఘాటు కామెంట్స్ చేశారు.

నడ్డా కాన్వాయ్‌పై దాడి విషయంపై స్పందించిన మమతా..బీజేపీ ర్యాలీల్లో కార్యకర్తలు లేరని, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నడ్డా కాన్వాయ్​పై దాడి చేయించారని ఆరోపించారు మమత. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ విధంగా ఎలా మాట్లాడతారని మండిపడ్డారు ధనకర్​. రాష్ట్రంలో శాంతిభధ్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని వెల్లడించారు ధనకర్​. చట్టాన్ని ఉల్లంఘించే వారికి బెంగాల్​ పోలీసులు, యంత్రాంగం రక్షణ కల్పిస్తున్నాయని ఆరోపించారు.

Also Read : మూన్‌పైకి మనోడు… నాసా బృందంలో భారత సంతతికి చెందిన రాజా చారి …. ఆర్టిమిస్ కార్యక్రమంలో భాగం…