ఏపీలో తాము తలపెట్టిన సమ్మెకు ఆర్టీసీ కార్మికులు స్వస్తి చెప్పారు. బుధవారం సీఎం జగన్తో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. వారి డిమాండ్లపై సానుకూలంగా జగన్ స్పందించి, ఆర్టీసీ యాజమాన్యం విధించిన 27 డిమాండ్లకు అంగీకరించారు. దీంతో సమ్మె నుంచి ఆర్టీసీ యాజమాన్యం వెనక్కి తగ్గింది. గురువారం నుంచి తలపెట్టిన సమ్మెను కార్మికులు రద్దు చేసుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు ఆర్ధిక కష్టాలు ప్రభుత్వం చూసుకుంటుందని సీఎం అన్నారు.