AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది, ప్రతి నెలా ఖాళీల భర్తీ ప్రక్రియ

ప్రతి నెలా వలంటీర్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది

గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది, ప్రతి నెలా ఖాళీల భర్తీ ప్రక్రియ
Anil kumar poka
|

Updated on: Dec 09, 2020 | 10:23 AM

Share

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి నెలా వలంటీర్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది.. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని ప్రభుత్వం సూచించింది. ప్రతి నెలా 1 నుంచి 16 వరకు ఆయా జిల్లాల పరిధిలోని వలంటీర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ నవీన్‌కుమార్‌ జాయింట్‌ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిధిలోని ఖాళీల వివరాలను ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.60 లక్షల మంది వలంటీర్లు ఉండగా.. ప్రస్తుతం 7,120 వలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 5,154 గ్రామ వలంటీర్‌ పోస్టులు, 1,966 వార్డు వలంటీర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.