ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సాహో’కు స్పెషల్ షోస్

డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 30న విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ రోజుకు ఆరు ఆటలు ఆడేలా పర్మిషన్ ఇప్పించాలని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఇక వారి విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది. దీంతో పాటు టికెట్ […]

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'సాహో'కు స్పెషల్ షోస్
Follow us

|

Updated on: Aug 29, 2019 | 6:14 AM

డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 30న విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ రోజుకు ఆరు ఆటలు ఆడేలా పర్మిషన్ ఇప్పించాలని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఇక వారి విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది.

దీంతో పాటు టికెట్ రేట్లను కూడా పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక ఈ పెరిగిన రేట్లు ప్రధాన సెంటర్లలో రెండు వారాల పాటు, మిగతా సెంటర్లలో వారం పాటు అమలులో ఉండనున్నాయి. కాగా అదనపు షోస్ కోసం, టిక్కెట్ ధర పెంపు కోసం ‘సాహో’కు ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ సిగ్నల్ దొరికినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.