‘చంద్రబాబు కోటీశ్వరుల మనిషి’

తిరుమల శ్రీవారి పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి అపారమైన భక్తి కలిగి ఉన్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. జగన్ కు వ్యక్తులపై నమ్మకం కంటే.. ప్రజలంటే నమ్మకం ఎక్కువని.. ప్రజలు దేవుళ్లుగా భావించే వ్యక్తి సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుమలలో డిప్యూటి సీఎం మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు ఒకే కుటుంబం నుంచి నాడు వైఎస్, నేడు సీఎం జగన్ అందిస్తున్నారని తెలిపారు. డిక్లరేషన్ […]

'చంద్రబాబు కోటీశ్వరుల మనిషి'
Follow us

|

Updated on: Sep 22, 2020 | 9:31 AM

తిరుమల శ్రీవారి పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి అపారమైన భక్తి కలిగి ఉన్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. జగన్ కు వ్యక్తులపై నమ్మకం కంటే.. ప్రజలంటే నమ్మకం ఎక్కువని.. ప్రజలు దేవుళ్లుగా భావించే వ్యక్తి సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుమలలో డిప్యూటి సీఎం మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు ఒకే కుటుంబం నుంచి నాడు వైఎస్, నేడు సీఎం జగన్ అందిస్తున్నారని తెలిపారు. డిక్లరేషన్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని.. జగన్ గత ఏడాది శ్రీవారికి పట్టువస్త్రాలు అందించారు, రేపు శ్రీవారికి పట్టువస్త్రాలు అందిస్తారని ఆయన అన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఆనాడు పాదయాత్ర ప్రారంభం ముందు, ముగిసిన తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారని గుర్తు చేశారు. పీఠాధిపతులు అందరూ సీఎం జగన్ ను ఆశీర్వదించారని వెల్లడించారు. 500 దేవాలయాలు నిర్మాణం కు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని.. చంద్రబాబు దేవాలయాలను కూల్చివేశారని నారాయణస్వామి పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ఆయన అన్నారు.