నేడు మంత్రివర్గ విస్తరణ… కొత్త మంత్రులు వీరే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు జరగనుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గంలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు జరగనుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యులు సీదిరి అప్పలరాజు మంత్రి పదవులను పొందనున్నారు.
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా అతి కొద్ది మందితోనే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి జగన్, సభాపతి తమ్మినేని సీతారాం, శాసన మండలి ఛైర్మన్ షరీఫ్, మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు మాత్రమే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తూర్పు గోదావరి జిల్లాకు శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు మంత్రి పదవి వరించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్య కార కుంటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గోపాలకృష్ణ ఎమ్మెల్యే కాకముందు జడ్పీ ఛైర్మన్గా పనిచేశారు. అప్పలరాజు వైద్య వృత్తిలో సేవలందించారు. వీరిద్దరూ తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే కావడం విశేషం.