ఇవాళ బడ్జెట్‌పై ఏపీ సీఎం చర్చ..!

| Edited By:

Jul 04, 2019 | 12:40 PM

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో బడ్జెట్ కేటాయింపులపై చర్చించనున్నారు. ఏయే శాఖలకు ఎంత అవసరమో వాటిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో మాట్లాడనున్నారు. వీలైనంత తక్కువగా బడ్జెట్ పెట్టాలని సీఎం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో ఇసుక పాలసీపై భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు రూరల్ డెవలప్‌మెంట్ పంచాయతీ రాజ్‌ అధికారులతో […]

ఇవాళ బడ్జెట్‌పై ఏపీ సీఎం చర్చ..!
Follow us on

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో బడ్జెట్ కేటాయింపులపై చర్చించనున్నారు. ఏయే శాఖలకు ఎంత అవసరమో వాటిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో మాట్లాడనున్నారు. వీలైనంత తక్కువగా బడ్జెట్ పెట్టాలని సీఎం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో ఇసుక పాలసీపై భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు రూరల్ డెవలప్‌మెంట్ పంచాయతీ రాజ్‌ అధికారులతో సమావేశమవుతారు. ఇవాళ సీఎం జగన్ షెడ్యూల్‌ బిజీ బిజీగా ఉండనుంది.

కాగా.. సీఎం జగన్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలపై కూడా బడ్జెట్‌లో చర్చించనున్నారని సమాచారం. ముఖ్యంగా ‘నవరత్నాల పథకం’ అమలుపై చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే.. వ్యవసాయం, విద్య, నీటి వనరులు, ఎక్సైజ్, మున్సిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి, రాబడి, బీసీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, ఇల్లు, ఎండోమెంట్స్, ఇంధనం, అటవీ మరియు పర్యావరణం, పరిశ్రమలు మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటి), పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమాలకు బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నారు.