డేటా చోరీ విషయంపై సెంట్రల్ ఈసీతో భేటీ అయిన ఏపీ బీజేపీ నేతలు

| Edited By:

Mar 08, 2019 | 1:23 PM

డేటా చోరీ విషయంలో ఓ వైపు టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతుంటే.. బీజేపీ మాత్రం తనదైన రీతిలో వ్యూహాలు రచిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఏపీ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. ఓట్ల తొలగింపు విషయంలో చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు కమలనాథులు. ఈ భేటీలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ్యుడు జీవీఎల్ సహా బీజేపీనేతలు […]

డేటా చోరీ విషయంపై సెంట్రల్ ఈసీతో భేటీ అయిన ఏపీ బీజేపీ నేతలు
Follow us on

డేటా చోరీ విషయంలో ఓ వైపు టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతుంటే.. బీజేపీ మాత్రం తనదైన రీతిలో వ్యూహాలు రచిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఏపీ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. ఓట్ల తొలగింపు విషయంలో చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు కమలనాథులు. ఈ భేటీలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ్యుడు జీవీఎల్ సహా బీజేపీనేతలు ఉన్నారు.