మత్స్యకారుల కోసం.. రూ.3 కోట్లు విడుదల చేసిన.. ఏపీ సర్కార్..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. అయితే.. లాక్డౌన్తో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏపీ చర్యలు చేపట్టింది.
Fishermen: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. అయితే.. లాక్డౌన్తో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏపీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.3కోట్ల విడుదలకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. లాక్డౌన్తో దాదాపు 5వేల మంది మత్స్యకారులు సొంతూర్లకు రాలేక వివిధ రాష్ట్రాల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీరి కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వం వారిని స్వరాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంది. దీంతో మత్స్యకారుల కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.