ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిధిలోకి మరిన్ని అక్రమ దందాలు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై కొరడా ఝలుపించేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్‌. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిధిలోకి మరిన్ని అక్రమ దందాలు
Follow us

|

Updated on: Nov 26, 2020 | 4:54 PM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై కొరడా ఝలుపించేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్‌. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆన్‌లైన్‌ క్రికెట్, రమ్మీ, గ్యాంబ్లింగ్‌, డ్రగ్స్‌, ఎర్రచందనం, ఇతర నిషేధిత పదార్థాలతో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మొదటి నుంచి అక్రమ దందాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన ఏపీ సర్కార్‌… వీటన్నింటినీ ఎస్ఈబీ పరిధిలోకి తెస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

నిన్న …మొన్నటి వరకూ కేవలం ఇసుక అక్రమ రవాణా, మద్యం అమ్మకాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిమితమై ఉంది. ఇకపై అన్ని రకాల గ్యాంగ్లింగ్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, డ్రగ్స్‌ , ఎర్రచందనం, నిషేధిత గుట్కా లను కూడా ఎస్ఈబీ పరిధిలోకి తెచ్చింది. ఇటీవల రాష్ట్రంలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ , రమ్మీ ఆటలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీటిని నిషేధించినా..అక్కడక్కడా తరచూ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనికోసం పక్కా వ్యవస్థ లేకపోవడంతో నియంత్రణ కొరవడింది. ఇప్పుడు ఎస్ఈబీ పరిధిలోకి తీసుకురావడంతో బెట్టింగ్‌ బాబులకు ముచ్చెమటలు పట్టనున్నాయి. ఇక, ఒక్కసారి పట్టుబడితే అంతే సంగతులు..