AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాయావతితో చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతితో లక్నోలో భేటీ అయ్యారు. కాగా తాజా రాజకీయ పరిస్థితులు, వీవీ ఫ్యాట్ స్లిప్పుల లెక్కింపు, బీజేపీపై ఉమ్మడి పోరు వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది.  అంతకు ముందు ఆయన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ ఉదయం చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకి […]

మాయావతితో చంద్రబాబు భేటీ
Ram Naramaneni
|

Updated on: May 18, 2019 | 8:10 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతితో లక్నోలో భేటీ అయ్యారు. కాగా తాజా రాజకీయ పరిస్థితులు, వీవీ ఫ్యాట్ స్లిప్పుల లెక్కింపు, బీజేపీపై ఉమ్మడి పోరు వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది.  అంతకు ముందు ఆయన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ ఉదయం చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకి మెజారిటీ రాకపోతే అనుసరించాల్సిన వ్యూహం సిద్ధం చేయాల్సిందిగా ఆయన రాహుల్ గాంధీని కోరినట్టు సమాచారం.

కాగా ఏపీ సీఎం ఇప్పటికే వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలతో అనేక మార్లు చర్చలు జరిపారు. వీరిలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారామ్ యేచూరి ఉన్నారు.