కరోనా కట్టడిలో జగన్ సర్కార్ మరో ముందడుగు.. గ్రామాలకు ‘సంజీవని’..

Sanjeevani Vehicles Andhra Pradesh: కరోనాపై పోరులో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ఇంద్ర బస్సులను కరోనా టెస్టింగ్ సెంటర్లుగా మారుస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. వాటికి ‘సంజీవని’ అనే నామకరణం చేశారు. వైరస్ ఉద్ధృతి బాగా పెరిగిపోతున్న నేపధ్యంలో గ్రామాల్లో ఎక్కువగా పరీక్షలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ జిల్లాలకు ‘సంజీవని’ బస్సులను పంపిస్తోంది. ప్రతీ జిల్లాకు నాలుగు చొప్పున బస్సులను పంపిస్తుండగా.. ఒక్కో బస్సులో పది మంది […]

కరోనా కట్టడిలో జగన్ సర్కార్ మరో ముందడుగు.. గ్రామాలకు సంజీవని..

Updated on: Jul 15, 2020 | 1:23 AM

Sanjeevani Vehicles Andhra Pradesh: కరోనాపై పోరులో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ఇంద్ర బస్సులను కరోనా టెస్టింగ్ సెంటర్లుగా మారుస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. వాటికి ‘సంజీవని’ అనే నామకరణం చేశారు. వైరస్ ఉద్ధృతి బాగా పెరిగిపోతున్న నేపధ్యంలో గ్రామాల్లో ఎక్కువగా పరీక్షలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ జిల్లాలకు ‘సంజీవని’ బస్సులను పంపిస్తోంది.

ప్రతీ జిల్లాకు నాలుగు చొప్పున బస్సులను పంపిస్తుండగా.. ఒక్కో బస్సులో పది మంది ఒకేసారి పరీక్ష చేయించుకునేలా ఏర్పాట్లు చేసింది. ఈ బస్సుల్లో టెస్టులు చేసి అప్పటికప్పుడే ఫలితాలను కూడా వెల్లడిస్తారు. మొత్తంగా 52 బస్సులను తయారు చేయనున్న ఏపీఎస్ఆర్టీసీ.. ఇప్పటివరకు 22 బస్సులను సిద్దం చేసింది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నెలాఖరులోగా 70 బస్సులను సిద్దం చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. కాగా, కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలకు నాలుగు కంటే ఎక్కువ బస్సులను పంపాలని నిర్ణయం తీసుకున్నారు.

Also Read: కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 15 వేలు.. జగన్ సర్కార్ సంచలనం..

Loading...
Unable to load recommendations.
Follow Us