ఆంధ్రప్రదేశ్ లో రెడ్ జోన్లకు సంబంధించి ఏపీ సర్కార్ స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గ్రీన్ జోన్లలో మూడవ దశ లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశకాల ప్రకారం అనేక సడలింపులు ఇచ్చింది. తాజాగా, రెడ్ జోన్లలో నిషేధం విధించిన అంశాలపై గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది.
రెడ్ జోన్లలో నిషేదం వేటిపైన అంటే….
అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే మొదట హెచ్చరిక చేస్తామని ఇస్తామని తెలిపింది. మాట వినకుండా రెండో సారి కూడా అలాగే వ్యవహరిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం 2005, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897, సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.