AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెస్ట్ ఇన్ పీస్ వర్మా… నీపై కేసులు వేయనుః అమృత

'ప్రణయ్ హత్య' ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రణయ్ భార్య అమృత స్పందించారు.

రెస్ట్ ఇన్ పీస్ వర్మా... నీపై కేసులు వేయనుః అమృత
Ravi Kiran
|

Updated on: Jun 22, 2020 | 10:59 AM

Share

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రణయ్ హత్య’ ఆధారంగా ‘మర్డర్’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫాదర్స్ డే రోజున విడుదల చేశారు. అమృత ప్రణయ్‌ల ప్రేమకథ, ఆ తర్వాత మారుతీరావు పరువు హత్య కథాంశంతో ఈ సినిమాను రూపొందించనున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ చెప్పకనే చెబుతోంది. తాజాగా దీనిపై ప్రణయ్ భార్య అమృత స్పందించారు.

‘దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మర్డర్ పోస్టర్‌పై ఆమె నిప్పులు చెరిగారు. పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అమృత బాధపడ్డారు. తన కొడుకును చూసుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని బ్రతకడానికి ప్రయత్నిస్తుంటే.. ఇప్పుడు తన జీవితంలోకి రామ్ గోపాల్ వర్మ రూపంలో కొత్త సమస్య ఎదురవుతోందని వాపోయారు. ‘నువ్వు రిలీజ్ చేసిన పోస్టర్‌తో నా జీవితానికి ఎటువంటి పోలికలు లేవు. సినిమా కోసం నువ్వు ఇంతలా దిగజారుతావని అనుకోలేదు. మా పేర్లను ఉపయోగించి నువ్వు అమ్ముకోవాలనుకుంటున్న తప్పుడు కథ. నిన్ను చూస్తే జాలి వేస్తోంది. నీపై ఎలాంటి కేసులు పెట్టను. రెస్ట్ ఇన్ పీస్.. అని అంటూ వర్మపై అమృత మండిపడ్డారు.