ఐటీబీపీకి హోంశాఖ ఆర్డర్స్ , హైఅలర్ట్
ఎల్ఓసీ వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, శశస్త్ర సీమా బల్ సైనిక బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఎల్ఓసీ వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, శశస్త్ర సీమా బల్ సైనిక బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హోంమంత్రిత్వ శాఖ, సరిహద్దు నిర్వహణ కార్యదర్శి, ఎస్ఎస్బీ, ఐటీబీపీ ఉన్నతాధికారులు సంయుక్తంగా నిర్వహించిన హైలెవల్ మీటింగ్లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే ఎస్ఎస్బీకి చెందిన పలు ఆర్మీ టీమ్స్ను అరుణాచల్ ప్రదేశ్, భారత్-నేపాల్ బోర్డర్ ఏరియాలకు తరలించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అత్యంత కీలక ప్రదేశాలుగా పరిగణిస్తున్న ఉత్తరాఖండ్, సిక్కింలో భారత్-చైనా-టిబెట్ కలిసే ట్రై-జంక్షన్ బోర్డర్లో చైనా దూకుడు చర్యలకు పూనుకునే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి హోం శాఖకు సమాచారం అందింది. చైనా బోర్డర్స్లో పారా మిలటరీ దళాలు భద్రతను పటిష్ఠం చేశాయి. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్, సిక్కిం బోర్డర్స్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. సిక్కిం, ఉత్తరాఖండ్ ట్రై-జంక్షన్ ఏరియాలకు 80 సైనిక బలగాలను పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎల్ఓసీ వెంబడి భద్రతా చర్యల్ని పరిశీలించేందుకు భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే లేహ్లో పర్యటిస్తున్నారు.
Also Read : నో హ్యాండ్ షేక్, ఓన్లీ నమస్తే, రష్యాలో రక్షణ మంత్రి