గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్, తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు
తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ 20, 761 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు చెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా తెలంగాణలో ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు అమెజాన్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది. ప్రతి అవైలబిలిటీ జోన్లో అనేక డాటా సెంటర్ల ఏర్పాటు చేయనున్నారు. 2022 సంవత్సర ప్రథామార్దంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించనుంది.
అమెజాన్ భారీ పెట్టుబడిని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనని చెప్పారు. ఇంత భారీ పెట్టుబడి రావడం అంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణ పారదర్శక, వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను తన దావోస్ పర్యటనలో కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడి తర్వాత తెలంగాణ డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా ఇప్పటికే అతిపెద్ద కార్యాలయాన్ని కలిగి ఉన్న అమెజాన్ సంస్థతో తెలంగాణ బంధం మరింత బలోపేతం అవుతుందన్న మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Hello India??! A second #AWS Region is coming to Hyderabad! Read the details in @jeffbarr‘s blog. https://t.co/XqfwB6LAQP pic.twitter.com/z5FQKYsgGV
— Amazon Web Services (@awscloud) November 6, 2020
Also Read :