Sai Pallavi-Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటించనున్నాడు. ఇక ఇందులో బన్నీకి జోడిగా రష్మిక నటిస్తోన్న విషయం తెలిసిందే. అల్లుఅర్జున్ తొలిసారి మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఫొటోలు చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి నటించనుందని సమాచారం. అంతేకాదు ఇందులో సాయిపల్లవి బన్నీకి చెల్లెలిగా నటించనుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి హీరోయిన్గా కెరీర్ పీక్లో ఉన్న సమయంలో సాయి పల్లవి ఒక యంగ్ హీరోకు చెల్లిగా నటించడానికి ఆసక్తిచూపిస్తుందా అంటే.. కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఇటీవల సాయిపల్లవికి చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో నటించే అవకాశం వచ్చినా తిరస్కరించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: Rashmika Mandanna: అవకాశం వస్తే ఆ నటి బయోపిక్లో తప్పకుండా నటిస్తా: టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న..