గుజరాత్లో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా…
గుజరాత్ వడోదరలో విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్లో ఏడుగురు మృతి చెందారు. హోటల్కు సబంధించిన సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు అజయ్ వాసవ్, విజయ్ చౌహాన్, సహదేవ్ వాసవలను హోటల్ సిబ్బందిగా గుర్తించగా.. మిగిలిన నలుగురు.. ధబోయ్ ప్రాంతంలోని థువావికి చెందిన పారిశుద్ద్య కార్మికులని భావిస్తున్నారు. ఈ ఘటనపై ధబోయ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. హోటల్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా.. […]
గుజరాత్ వడోదరలో విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్లో ఏడుగురు మృతి చెందారు. హోటల్కు సబంధించిన సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు అజయ్ వాసవ్, విజయ్ చౌహాన్, సహదేవ్ వాసవలను హోటల్ సిబ్బందిగా గుర్తించగా.. మిగిలిన నలుగురు.. ధబోయ్ ప్రాంతంలోని థువావికి చెందిన పారిశుద్ద్య కార్మికులని భావిస్తున్నారు.
ఈ ఘటనపై ధబోయ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. హోటల్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా.. ఏమైనా విష వాయువులు వెలువడి మరణించి ఉంటారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.