ఒక్కరి నుంచి ఫ్యామిలీలోని 31 మందికి సోకిన‌ కరోనా

దేశ రాజధానిని కరోనావైర‌స్ వెంటాడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్ర‌భుత్వ లెక్క‌లు ప్ర‌కారం.. శనివారం మరో 186 మందికి క‌రోనా​ సోక‌గా .. ఒకరు ప్రాణాలు విడిచారు. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య‌ మొత్తం కేసుల సంఖ్య 1893కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 43 మంది ప్రాణాలు విడిచారు. జహంగీర్​పురీలో ఒక్కరి నుంచి… కుటుంబంలోని 31 మందికి కోవిడ్ సోకడం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఉత్తర దిల్లీ జహంగీర్​పురీలో నివసిస్తున్న ఓ ఫ్యామిలిలో 31 మందికి […]

ఒక్కరి నుంచి ఫ్యామిలీలోని 31 మందికి సోకిన‌ కరోనా

Updated on: Apr 19, 2020 | 8:45 AM

దేశ రాజధానిని కరోనావైర‌స్ వెంటాడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్ర‌భుత్వ లెక్క‌లు ప్ర‌కారం.. శనివారం మరో 186 మందికి క‌రోనా​ సోక‌గా .. ఒకరు ప్రాణాలు విడిచారు. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య‌ మొత్తం కేసుల సంఖ్య 1893కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 43 మంది ప్రాణాలు విడిచారు. జహంగీర్​పురీలో ఒక్కరి నుంచి… కుటుంబంలోని 31 మందికి కోవిడ్ సోకడం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఉత్తర దిల్లీ జహంగీర్​పురీలో నివసిస్తున్న ఓ ఫ్యామిలిలో 31 మందికి కోవిడ్ సోకింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళ‌న‌లో ఉన్నారు. కోవిడ్ సోకిన కుటుంబ స‌భ్యులంద‌రినీ ప్రస్తుతం నరేలాలోని సెల్ఫ్​ ఐసోలేషన్​ సెంట‌ర్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక మహిళ నుంచే వీరందిరికీ కోవిడ్ సోకినట్లు పేర్కొన్నారు. అయితే.. వీరెవరికీ వైరస్​ సింట‌మ్స్ భ‌య‌ట‌ప‌డ‌లేద‌ని అధికారులు పేర్కొవ‌డం గమనార్హం.

”జహంగీర్​పురీలో ఏప్రిల్​ 8న ఓ మహిళ ప్రాణాలు విడిచింది. ఏప్రిల్​ 10న చేసిన కరోనా టెస్టుల్లో ఆమెకు కరోనా పాజిటివ్​గా నిర్దార‌ణ అయ్యింది. ఆమె ఫ్యామిలీలోని 26 మందికి శుక్రవారమే క‌రోనా​ పాజిటివ్ అని తేల‌గా… శనివారం మరో ఐదుగురు వ్యాధి బారినపడ్డారు. ఇందులో చిన్నపిల్లలూ ఉన్నారు” అని సీనియర్​ అధికారి పేర్కొన్నారు.