బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్…
లాక్డౌన్ కొనసాగుతున్న వేళ కస్టమర్స్ విషయంలో బీఎస్ఎన్ఎల్ మానవతా దృక్పథంతో వ్వవహరించింది. తమ ఖాతాలను రీఛార్జ్ చేసుకోలేకపోయిన వినియోగదారులు మే 5 వరకు ఇన్కమింగ్ కాల్స్ ఉచితంగా పొందే వీలు కల్పిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాన్ గడువు ముగిసిన, జీరో బ్యాలెన్స్ ఉన్న బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. బీఎస్ఎన్ఎల్… తన కస్టమర్స్ ఫోన్ రీఛార్జ్ చేసుకునేందుకు వీలుగా కొత్త ఓ టోల్ […]
లాక్డౌన్ కొనసాగుతున్న వేళ కస్టమర్స్ విషయంలో బీఎస్ఎన్ఎల్ మానవతా దృక్పథంతో వ్వవహరించింది. తమ ఖాతాలను రీఛార్జ్ చేసుకోలేకపోయిన వినియోగదారులు మే 5 వరకు ఇన్కమింగ్ కాల్స్ ఉచితంగా పొందే వీలు కల్పిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాన్ గడువు ముగిసిన, జీరో బ్యాలెన్స్ ఉన్న బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
బీఎస్ఎన్ఎల్… తన కస్టమర్స్ ఫోన్ రీఛార్జ్ చేసుకునేందుకు వీలుగా కొత్త ఓ టోల్ ఫ్రీ నెంబర్తో హెల్ప్లైన్ డెస్క్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ ఫెసిలిటీ ఉత్తర, పశ్చిమ జోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. 2020 ఏప్రిల్ 22 నుంచి దక్షిణ, తూర్పు జోన్లలోనూ అందుబాటులోకి రానుంది.