బీఎస్​ఎన్​ఎల్​​ వినియోగదారులకు బంపర్ ఆఫర్…

లాక్​డౌన్ కొనసాగుతున్న వేళ క‌స్ట‌మ‌ర్స్ విష‌యంలో బీఎస్​ఎన్​ఎల్​ మానవతా దృక్పథంతో వ్వవ‌హ‌రించింది. తమ ఖాతాలను రీఛార్జ్​ చేసుకోలేకపోయిన వినియోగదారులు మే 5 వరకు ఇన్​కమింగ్​​ కాల్స్ ఉచితంగా పొందే వీలు కల్పిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాన్ గడువు ముగిసిన, జీరో బ్యాలెన్స్ ఉన్న బీఎస్​ఎన్​ఎల్ ప్రీపెయిడ్ వినియోగదారులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సంస్థ వెల్ల‌డించింది. బీఎస్​ఎన్​ఎల్​… తన క‌స్ట‌మ‌ర్స్ ఫోన్​ రీఛార్జ్ చేసుకునేందుకు వీలుగా కొత్త ఓ టోల్​ […]

బీఎస్​ఎన్​ఎల్​​ వినియోగదారులకు బంపర్ ఆఫర్...
Follow us

|

Updated on: Apr 19, 2020 | 10:03 AM

లాక్​డౌన్ కొనసాగుతున్న వేళ క‌స్ట‌మ‌ర్స్ విష‌యంలో బీఎస్​ఎన్​ఎల్​ మానవతా దృక్పథంతో వ్వవ‌హ‌రించింది. తమ ఖాతాలను రీఛార్జ్​ చేసుకోలేకపోయిన వినియోగదారులు మే 5 వరకు ఇన్​కమింగ్​​ కాల్స్ ఉచితంగా పొందే వీలు కల్పిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాన్ గడువు ముగిసిన, జీరో బ్యాలెన్స్ ఉన్న బీఎస్​ఎన్​ఎల్ ప్రీపెయిడ్ వినియోగదారులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సంస్థ వెల్ల‌డించింది.

బీఎస్​ఎన్​ఎల్​… తన క‌స్ట‌మ‌ర్స్ ఫోన్​ రీఛార్జ్ చేసుకునేందుకు వీలుగా కొత్త ఓ టోల్​ ఫ్రీ నెంబర్​తో హెల్ప్​లైన్​ డెస్క్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ ఫెసిలిటీ ఉత్తర, పశ్చిమ జోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. 2020 ఏప్రిల్ 22 నుంచి దక్షిణ, తూర్పు జోన్లలోనూ అందుబాటులోకి రానుంది.