
మహారాష్ట్రలోని థానెలో విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేయడానికి లోనికి దిగిన కార్మికుల్లో ముగ్గురు మరణించగా.. మరొ ఐదుగురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతోొ వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. థానెలోని ధోకలి ప్రాంతంలో సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేయడానికి 11 మంది కార్మికులు అందులోకి దిగారు. అక్కడి విషవాయువులను పీల్చుకోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఐదుగురు ఆస్పత్రిపాలయ్యారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెద్యులు తెలిపారు.