అనంత్‌నాగ్‌లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

| Edited By:

Jun 17, 2019 | 1:20 PM

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు.. అనంత్ నాగ్‌లో కూంబింగ్ చేపట్టాయి. అయితే భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన ఆర్మీ జవాన్లు.. ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ముగ్గరు జవాన్లు గాయాలపాలయ్యారు. వీరిలో ఓ ఆఫీసర్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అనంత్‌నాగ్‌లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Follow us on

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు.. అనంత్ నాగ్‌లో కూంబింగ్ చేపట్టాయి. అయితే భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన ఆర్మీ జవాన్లు.. ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ముగ్గరు జవాన్లు గాయాలపాలయ్యారు. వీరిలో ఓ ఆఫీసర్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.