బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. బకెట్‌లో శిశువును వదిలేసిన విద్యార్థిని..

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. 18 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి హాస్టల్ బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్రలోని ధులే జిల్లాలోని సక్రీ పట్టణంలో ఉన్న సావిత్రీబాయి ఫులే ఆదివాసి బాలికల వసతి గృహంలో ఫిబ్రవరి 29న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ విద్యార్థిని(18) బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చి ఆ తర్వాత శిశువును బకెట్‌లో వదిలేసి వెళ్లిపోయింది. అయితే.. చిన్నారి ఏడుపు విన్న హాస్టల్‌ వార్డెన్‌ బాత్రూమ్‌లోకి […]

బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. బకెట్‌లో శిశువును వదిలేసిన విద్యార్థిని..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 02, 2020 | 9:47 PM

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. 18 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి హాస్టల్ బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్రలోని ధులే జిల్లాలోని సక్రీ పట్టణంలో ఉన్న సావిత్రీబాయి ఫులే ఆదివాసి బాలికల వసతి గృహంలో ఫిబ్రవరి 29న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ విద్యార్థిని(18) బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చి ఆ తర్వాత శిశువును బకెట్‌లో వదిలేసి వెళ్లిపోయింది.

అయితే.. చిన్నారి ఏడుపు విన్న హాస్టల్‌ వార్డెన్‌ బాత్రూమ్‌లోకి వెళ్లి చూడగా బకెట్‌లో పడి ఉన్న పసికందు కనిపించింది. విద్యార్థినులంతా ఆ బిడ్డ ఎవరో తమకు తెలియదని చెప్పడంతో అనుమానం ఉన్న ఓ విద్యార్థినిని పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆ బిడ్డకు జన్మనిచ్చింది సదరు విద్యార్థిని అని తేలింది. మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీబిడ్డను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.