లోయలో పడ్డ బస్సు.. 11మంది మృతి

| Edited By:

Jun 28, 2019 | 8:15 PM

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. షోపియాన్ జిల్లాలోని పీర్ కీ గలీ ప్రాంతంలో బస్సు లోయలో పడడంతో 11 మంది చనిపోయారు. మరో 7 మంది తీవ్రగాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సురన్‌కోటేలోని ఓ ప్రైవేట్ కంప్యూటర్ ఇన్సిట్యూట్‌కు చెందిన విద్యార్ధులు విహారయాత్రకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

లోయలో పడ్డ బస్సు.. 11మంది మృతి
Follow us on

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. షోపియాన్ జిల్లాలోని పీర్ కీ గలీ ప్రాంతంలో బస్సు లోయలో పడడంతో 11 మంది చనిపోయారు. మరో 7 మంది తీవ్రగాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సురన్‌కోటేలోని ఓ ప్రైవేట్ కంప్యూటర్ ఇన్సిట్యూట్‌కు చెందిన విద్యార్ధులు విహారయాత్రకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.