అతడు రెండో ప్రపంచ యుద్ద యోధుడు.. కొద్ది రోజుల క్రితమే వందో పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఇంకో పదేళ్లయినా బతుకుతానని చెప్పుకునేవాడు. దురదృష్టవశాత్తు కరోనా బారిన పడి కన్ను మూశాడు.. మరణించిన తమ తాత ఫిలిప్ కాహ్న్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు వారసులు. ఫిలిప్ కాహ్న్ కవల సోదరుడు శ్యామూల్ అప్పట్లో స్పానిష్ ఫ్లూతో మరణించడం విశేషం..న్యూయార్క్ వెస్ట్ బేబీలోన్ కు చెందిన ఫిలిప్ కాహ్న్ అమెరికా సైన్యంలో సేవలు అందించారు. రెండో ప్రపంచ యుద్దంలో కూడా పాల్గొన్నారు. కానీ తన వందో ఏట కరోనా మహమ్మారి భారిన పడ్డారు. ఫిలిప్ కాహ్న్ కు శామ్యూల్ అనే ఒక కవల సోదరుడు కూడా ఉండేవాడు. ఇప్పుడు కరోనా అందరినీ వణికించినట్లే స్పానిష్ ఫ్లూ అప్పటి తరాన్ని భయపెట్టింది. ఫిలిప్ కాహ్న్ ఎప్పుడూ తన సోదరుడు శామ్యూల్ ను తలచుకునేవాడని, రెండో ప్రపంచ యుద్దానికి సంబంధించిన విషయాలు తమతో పంచుకునేవారడని గుర్తు చేసుకునేవాడని చెబుతున్నారు ఆయన మనవడు వారెన్ జిస్మాన్.