IPL 2020: రికార్డు బ్రేక్ చేసిన ఐపీఎల్‌ ఓపెనింగ్ మ్యాచ్‌

| Edited By:

Sep 22, 2020 | 4:19 PM

ముంబయి ఇండియన్స్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే.

IPL 2020: రికార్డు బ్రేక్ చేసిన ఐపీఎల్‌ ఓపెనింగ్ మ్యాచ్‌
Follow us on

MI vs CSK: ముంబయి ఇండియన్స్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఓపెనింగ్‌ మ్యాచ్‌ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ‌ఈ మ్యాచ్‌ని 20కోట్ల మంది క్రికెట్ ప్రియులు వీక్షించారు. దీన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇది సరికొత్త ఫీట్ అని ఆయన పేర్కొన్నారు. ఒక ఓపెనింగ్‌ స్పోర్టింగ్‌ ఈవెంట్‌ని 20 కోట్ల మంది వీక్షించడం ప్రపంచంలోనే ఇది తొలిసారని జై షా తెలిపారు. ఇప్పటివరకు ఏ లీగ్‌లో ఇంతటి ఆదరణ రాలేదని వివరించారు. కాగా ఇందులో చెన్నై సూపర్‌ కింగ్స్  గెలవగా.. దీని‌ ద్వారా ధోని మరో అరుదైన రికార్డును సాధించారు. ఒక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 100 విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోని నిలిచారు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక కెప్టెన్‌ ధోని కావడం గమనర్హం.

Read More:

కేసీఆర్ కిట్‌ పేరిట మోసం.. కేసు నమోదు చేసిన పోలీసులు

రియాకు మరో షాక్‌.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు