Sonu Sood : సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్‌ను మంత్రి గౌతమ్ రెడ్డితో కలిసి ప్రారంభించిన దివ్యాంగురాలు నాగలక్ష్మి

|

Jul 24, 2021 | 6:56 AM

నెల్లూరుజిల్లా ఆత్మకూరులో సోనూసూద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డితో కలిసి దివ్యాంగురాలు నాగలక్ష్మి

Sonu Sood : సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్‌ను మంత్రి గౌతమ్ రెడ్డితో కలిసి ప్రారంభించిన దివ్యాంగురాలు నాగలక్ష్మి
Sonu Sood Oxygen Plant
Follow us on

Sonu Sood – Mekapati Goutham Reddy – Nagalakshmi : నెల్లూరుజిల్లా ఆత్మకూరులో సోనూసూద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డితో కలిసి దివ్యాంగురాలు నాగలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఇటీవల నటుడు సోనూసూద్ రూ. 1.50 కోట్లతో నెల్లూరు జిల్లాకు ఆక్సిజన్ ప్లాంట్ అందించారు. అయితే, ఇదే ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి అనే దివ్యాంగురాలి చేత ఈ ఆక్సిజన్ ప్లాంటు ప్రారంభించాలంటూ సోనూసూద్ ఇక్కడి అధికారులను కోరడంతో నాగలక్ష్మి చేత ఈ ప్లాంటు ను ప్రారంభించారు.

Sonu Sood

గతంలో సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రభావితురాలైన నాగలక్ష్మి తన ఐదు నెలల ఫింక్షన్ ను సోను సూద్ ట్రస్ట్ కి ఇవ్వడం తెలిసిందే. ఈ విషయంపై అప్పట్లో సోనూసూద్ సోషల్ మీడియా వేదికగా నాగలక్ష్మిను అభినందించారు.. ఇక, తాజాగా సోనూసూద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ను నాగలక్ష్మి చేతులు మీదుగా ప్రారంభించాలని సోనూసూద్ కోరడం విశేషం.

Sonu Sood

Read also : Road accident : నాగర్ కర్నూలు జిల్లా చెన్నారం గేట్‌ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం