
నిపుణుల అభిప్రాయం ప్రకారం మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ సాధారణంగా E. coli బాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బాక్టీరియా మూత్ర నాళం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, తక్కువ నీళ్లు తాగడం, అపరిశుభ్రమైన టాయిలెట్లను ఉపయోగించడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వంటివి ఈ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి ఈ సమస్య ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఇన్ఫెక్షన్ మూత్రాశయానికే పరిమితమైతే అది సాధారణంగా తీవ్రమైన సమస్య కాదు. అయితే అది మూత్రపిండాలకు వ్యాపిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం కొనసాగితే మూత్రపిండాల పనితీరు క్షీణించే ప్రమాదం ఉంది. మీకు అధిక జ్వరం, చలి, వాంతులు, మూత్రంలో రక్తం, నడుము నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
తగినంత నీళ్లు తాగడం, ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకోకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. వైద్యుని సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.